*పత్రికా ప్రకటన* *15.11.2024* • *బొల్లా బ్రహ్మనాయుడిపై గ్రీవెన్స్ లో బాధితుడు ఫిర్యాదు* • *సోషల్ మీడియాలో నారా భువనేశ్వరమ్మపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వ్యక్తిపై చర్యలకు టీడీపీ నేత ఫిర్యాదు* • *అదనపు కట్నం కోసం యువతి ప్రాణం తీసిన కుటుంబంపై కఠిన చర్యలకు వినతి* మాదిగ కులంకు చెందిన తనపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆయన అనుచరులు సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్ట్ లు పెట్టి తనమీద తప్పుడు కేసులు పెట్టారని.. తప్పడు కేసు అని తెలిసినా సీఐ అచ్చయ్య తనపై ఛార్జ్ సీట్ దాఖలు చేశాడని.. వీరిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని.. తనపై పెట్టిన అక్రమ కేసులను తొలగించాని పల్నాడు జిల్లా వినుకొండ పట్టణానికి చెందిన గంటిపోగు స్టీఫెన్ బాబు నేడు టీడీపీ కేంద్రకార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణకార్యక్రమంలో నేతలు ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ లకు వినతి ఇచ్చి విజ్ఞప్తి చేశాడు. అర్జీని స్వీకరించిన నేతలు విచారించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని బాధితుడికి హామీ ఇచ్చారు. • నంద్యాల జిల్లా గోస్పాడు మండల టీడీపీ కన్వీనర్ తెల్లపురిగ్రామానికి చెందిన కాటంరెడ్డి తులసీశ్వరరెడ్డి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేస్తూ.. నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన మునగాల హారీష్ రెడ్డి వైసీపీ తరఫున సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ.... నారా భువనేశ్వరమ్మ, చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై అసభ్యకరమైన పోస్ట్ లు పెడుతున్నాడని.. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. • అదనపు కట్నం కోసం పెళ్లైన ఆరు నెలలకే తన మనవరాలు షేక్ అమీరున్ ను దారుణంగా చంపారని.. చంపిన వ్యక్తులు సయ్యద్ రఫీ, సయ్యద్ ఇబ్రహీం, కరీమూన్, సైదాబీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడంలేదని.. తన మనవరాలి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని గూంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామానికి చెందిన షేక్ మౌలాలి నేతలకు అర్జీ ఇస్తూ వాపోయాడు. • తాము కొనుగోలు చేసిన స్థలాన్ని పిల్లల పెళ్లిళ్లకోసం అమ్ముకోవడానికి అని వెళితే వైసీపీ నేతలు ఆక్రమించి దైర్జన్యం చేస్తున్నారని. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కు చెందిన దాసరి బోడయ్య, సత్సల లక్ష్మమలు నేతల ముందు వాపోయారు. భూ కబ్జా దారుల నుండి తమ భూమిని విడిపించి న్యాయం చేయాలని వేడుకున్నారు. • నంద్యాల జిల్లా శ్రీశైలంలోని వడియరాజుల సత్రంలో మాజీ ఎమ్మెల్యే అండతో జె. రాములు అనే వ్యక్తి సంత్రంకు సంబంధించిన వ్యక్తులను కాకుండా వేరోకరిని సంత్రంలోకి తీసుకు వస్తూ.. రూముల దాతలు, సత్రం సభ్యులను ఇబ్బంది పెడుతూ దౌర్జన్యం చేస్తున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు సత్రానికి సంబంధించిన సభ్యులు నేతలకు విజ్ఞప్తి చేశారు. • సెప్టెంబర్ లో వచ్చిన వరదల కారణంగా తన త్రీవిలర్ బండి వరదల్లో కొట్టుకుపోయిందని.. తాను, తన భార్య ఇద్దరం దివ్యాంగులమని.. తమకు ఎటువంటి జీవనాధారం లేదని.. తమకు జీవనోపాధికి సాయం చేయాలని విజయవాడ జక్కంపూడికి చెందిన పర్సు నవీన్ బాబు నేతలకు విజ్ఞప్తి చేశాడు. • వైసీపీ నేతల దౌర్జన్యాలను ఎదిరించి పార్టీకోసం ప్రాణాలు లెక్కచేయంకుడా పనిచేసి జైలుకు వెళ్లిన నేను మదిగ కులస్తుడిని కావడంతో.. కులం పేరుతో దుషిస్తూ.. స్థానికంగా ఉన్న నేతలు కొంతమంది వైసీపీ నేతలతో కుమ్మక్కై వారికి పనిచేస్తూ.. రెడ్లం మేము మేము ఒకటే అంటూ తమపై దౌర్జన్యం చేస్తున్నారని.. వైసీపీ నేతలకు కొమ్ముకాస్తున్నారని.. ఇటివంటి వారివలన పార్టీ నష్టపోవడమే కాకుండా.. తమ ప్రాణాలకు ముప్పు ఉందని.. కులం పేరుతో దూషించిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలానికి చెందిన దాసరి అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశాడు. • అనంతపురానికి చెందిన నూర్ మహ్మద్ విజ్ఞప్తి చేస్తూ.. తన తండ్రి బి. మహబూబ్ బాషా SPSPDCL లో క్లాస్ 3 కాంట్రాక్టర్ గా హిందూపురం డివిజన్ లోని రుద్దం మండలంలో అప్పులు తెచ్చి రూ. 12 లక్షల లైన్ వర్క్ పనులు చేశాడని.. ఆ డబ్బులు రాకపోవడంతో తన తండ్రి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడని. తన తండ్రికి రావాల్సిన డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నాడు.